జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో దారుణం.. కస్టమర్‌ను చితకబాదిన బౌన్సర్లు, రక్తం కారుతున్నా వదలని వైనం

Siva Kodati |  
Published : Apr 24, 2022, 05:22 PM IST
జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో దారుణం.. కస్టమర్‌ను చితకబాదిన బౌన్సర్లు, రక్తం కారుతున్నా వదలని వైనం

సారాంశం

హైదరాబాద్‌లోని పబ్‌లు ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. మొన్నామధ్య బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలోని ఫుడింగ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని ప్రిజం పబ్‌లో కస్టమర్‌పై బౌన్సర్లు దాడి చేశారు. 

హైదరాబాద్‌ (hyderabad) జూబ్లీహిల్స్ (jubilee hills) ప్రిజం పబ్‌లో (prism pub) దారుణం జరిగింది. నందకిశోర్ (nanda kishore)  అనే కస్టమర్‌పై బౌన్సర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. మొత్తం ముగ్గురు బౌన్సర్లు సదరు కస్టమర్‌పై తమ ప్రతాపం చూపారు. బౌన్సర్లతో పాటు పబ్ యజమానులు కూడా కస్టమర్‌పై రెచ్చిపోయి దాడి చేశారు. కింద పడేసి చితకబాదారు. స్మోకింగ్ చేయొద్దని చెప్పినప్పటికీ నంద కిశోర్ స్మోక్ చేశాడన్న కారణంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు నంద కిశోర్. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?