బీజేపీ మూడో జాబితా విడుదల.. తెలంగాణలో 17 చోట్ల కమలం అభ్యర్థులు వీరే

By Mahesh KFirst Published Mar 24, 2024, 11:11 PM IST
Highlights

బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఈ జాబితా విడుదల చేసింది. 
 

BJP: తెలంగాణలో లోక్ సభ స్థానాలకు బీజేపీ ఈ రోజు అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది. ఇది వరకే బీజేపీ 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరి పేర్లను ప్రకటించింది. దీంతో తెలంగాణలో 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది.

తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. వరంగల్ (ఎస్సీ) లోక్ సభ స్థానానికి ఆరూరి రమేశ్, ఖమ్మం స్థానానికి తాండ్ర వినోద్ రావును అభ్యర్థులుగా ఖరారు చేసింది. మార్చి 2వ తేదీన 9 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా, ఆరుగురు అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తంగా తెలంగాణలోని 17 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఇలా ఉన్నారు.

1. సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
2. కరీంనగర్ - బండి సంజయ్
3. నిజామాబాద్ - ధర్మపురి అర్వింద్
4. మల్కాజ్ గిరి - ఈటల రాజేందర్
5. నాగర్ కర్నూల్ (ఎస్సీ) - పోతుగంటి భరత్
6. భువనగిరి - బూర నర్సయ్య
7. చేవెళ్ల - కొండా విశ్వేశ్వర రెడ్డి
8. జహీరాబాద్ - బీబీ పాటిల్
9. హైదరాబాద్ - డాక్టర్ మాధవీలత
10. ఆదిలాబాద్ (ఎస్టీ) - గోడం నగేశ్
11. మహబూబ్ నగర్ - డీకే అరుణ
12. మహబూబాబాద్ - సీతారాం నాయక్
13. పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్
14. మెదక్ - రఘునందన్ రావు
15. నల్గొండ - శానం సైదిరెడ్డి
16. వరంగల్ (ఎస్సీ) - ఆరూరి రమేశ్
17. ఖమ్మం - తాండ్ర వినోద్ రావు

click me!