కేసీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Published : Mar 15, 2021, 04:06 PM IST
కేసీఆర్‌పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

ఆదిలాబాద్: బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ముకాస్తోందన్నారు. హిందువులను హింసిస్తోందని ఆయన విమర్శించారు. 

also read:కేసీఆర్‌కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది: బండి సంజయ్

పోలీసులను ఎంఐఎం చెప్పు చేతల్లో టీఆర్ఎస్ సర్కార్ పెట్టిందని ఆయన ఆరోపించారు.  మహారాష్ట్ర నుండి బహిష్కరించిన వారే భైంసాలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే తాము ఈ విషయాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు. ప్రగతి భవన్ లోకి చొరబడి సీఎంను ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు ఆ పార్టీ వల విసురుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహన్ని నింపాయి. దీంతో అధికార  టీఆర్ఎస్ పై బీజేపీ చీఫ్ సంజయ్ దూకుడుగా విమర్శలు గుప్పిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?