సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. టచ్ చేసి చూడు అన్న పోటుగానివి మెడపై కత్తిపెట్టి లేఖ తీసుకున్నారని చెప్పడమేంటని కేసీఆర్ ను ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. రా రైస్ ఎంతైనా కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉందని తెలిపారు. అసలు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాశారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. రా రైస్ ఎంతైనా కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉందని తెలిపారు. అసలు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాశారని ప్రశ్నించారు.
కేంద్రం మెడలు వంచైనా కొనిపిస్తామని చెప్పి.. ఇప్పుడు మెడపై కత్తిపెట్టి లేఖ తీసుకున్నారని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. టచ్ చేసి చూడు అన్నావ్ గా సీఎం కేసీఆర్.. నువ్వు అంత పోటుగానివి అయితే మెడపై కత్తిపెట్టి లేఖ తీసుకోవడమేంటని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. సీఎం డైరెక్షన్లోనే బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, బీజేపీ నేతలపై కావాలనే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బీజేపీ అంటేనే కేసీఆర్కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
గతంలో నల్గొండలో రైతులను పరామర్శించడానికి వెళ్తే గొడవలు చేశారని, కరీంనగర్లో తనపై.. ఆర్మూర్లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై దాడి చేయడం దారుణం అన్నారు. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్తను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి హత్య చేసేందుకు కుట్ర చేశారని, రాష్ట్రంలో కొందరు పోలీసులు సీఎం కేసీఆర్ కు కొమ్ముకాస్తున్నారని, ఆ పద్దతి సరికాదని హెచ్చరించారు.
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్.. ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను శనివారం ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన నేతలకు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే శోభక్క.. పార్టీలో చేరారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు సరైన వేదిక బీజేపీ నేనని అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత అరాచకాలు చేయాలి. కోట్లు సంపాదించాలి.. ఆ సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసి గెలవాలన్నట్లుగా ఉందని విమర్శించారు.