తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్.. ఈ నెల 29,30 తేదీల్లో సమీక్షా సమావేశాలు..

Published : Aug 28, 2023, 10:20 AM IST
తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్.. ఈ నెల 29,30 తేదీల్లో సమీక్షా సమావేశాలు..

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన రైతు గోసా-బీజేపీ భరోసా సభ విజయవంతం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఈ సభకు హాజరైన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై విజయం సాధించేందుకు పార్టీని మరింత విస్తృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశంలో నేతలతో అమిత్ షా  చర్చించారు. 

అయితే తాజాగా ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ స్థానాల వారీగా బూత్ కమిటీలు, సెప్టెంబర్‌ 7న చలో హైదరాబాద్, నా మట్టి నా దేశం, బస్సు యాత్ర, ఓటర్ వెరిఫికేషన్, సెప్టెంబర్ 17, ఎన్నికలకు సన్నద్దం వంటి తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశాలకు పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 

సునీల్ బన్సల్ ( ఖమ్మం, మెదక్), అరవింద్ మీనన్ (ఆదిలాబాద్, నిజామాబాద్), తరుణ్ చుగ్ (కరీంనగర్, నల్గొండ), ప్రకాష్ జవదేవకర్ (మహబూబ్‌నగర్, వరంగల్) సమీక్షా సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు రాష్ట్రానికి చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా వెళ్లనున్నారు.  బండి సంజయ్ (ఆదిలాబాద్), డీకే అరుణ (నిజామాబాద్), కిషన్‌రెడ్డి (మెదక్), ఈటల రాజేందర్ (నల్గొండ)  సమావేశాలకు వెళ్లనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Actor Chiranjeevi: వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమంలో చిరు పంచ్ లకి నవ్వులే నవ్వులు | Asianet Telugu
Hyderabad: అప్పుడు కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? ఈ గ్రామాలు త్వ‌ర‌లోనే మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం