తెలంగాణలో హంగ్ వస్తుంది: ఎంపీ జీవీఎల్

Published : Nov 30, 2018, 10:09 PM IST
తెలంగాణలో హంగ్ వస్తుంది: ఎంపీ జీవీఎల్

సారాంశం

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. అనేక నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ, బహుముఖ పోటీ ఉందని, చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు.   

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. అనేక నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ, బహుముఖ పోటీ ఉందని, చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. 

ఎవరి పట్ల హవా లేదని, నియోజకవర్గాల పరిస్థితులు మారినప్పుడు మాత్రమే ఇండిపెండెంట్లు ఇంత పెద్ద సంఖ్యలో గెలిచే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇండిపెండెంట్లు ఐదుగురు మించి గెలిచే అవకాశం లేదని తెలిపారు. 

ఒకవేళ తెలంగాణలో హంగ్ ఏర్పడితే తాము టీఆర్ఎస్ కు మద్దుతు ఇవ్వబోమని తేల్చిచెప్పారు జీవీఎల్. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే ఉన్నారని కొత్తగా కలిసేదేముందని వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబుతో కూడా కేసీఆర్ కలిసి ఉండాలనుకున్నవారేనని చెప్పారు. మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే తప్పని చెప్పనని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu