తెలంగాణ‌లో బ‌ల‌ప‌డుతున్న బీజేపీ.. పార్టీలో చేర‌నున్న మాజీ ఐపీఎస్ అధికారి టి. కృష్ణ ప్ర‌సాద్..

Published : Jul 29, 2022, 10:13 AM ISTUpdated : Jul 29, 2022, 10:15 AM IST
తెలంగాణ‌లో బ‌ల‌ప‌డుతున్న బీజేపీ.. పార్టీలో చేర‌నున్న మాజీ ఐపీఎస్ అధికారి టి. కృష్ణ ప్ర‌సాద్..

సారాంశం

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ టి.కృష్ణ ప్ర‌సాద్ త్వరలోనే బీజేపీ లో చేరనున్నారు. ఆయన చేరికకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణకు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. రెండేళ్ల కిందట పదవి విరమణ చేశారు.

తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అడుగులు వేస్తోంది. మేధావులు, విద్యావంతుల‌ను పార్టీలోకి చేర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి టి. కృష్ణ ప్ర‌సాద్ బీజేపీలో చేరే అవకాశం క‌నిపిస్తుండ‌ట‌మే దీనికి నిద‌ర్శ‌నం. తెలంగాణకు చెందిన ఆయ‌న 1987- బ్యాచ్ IPS ఆఫీస‌ర్. ఆయ‌న 2020 సంవ‌త్స‌రంలో ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. వాస్త‌వానికి కృష్ణ ప్ర‌సాద్ నేడు (జూలై 29న) బీజేపీలో చేరాల్సి ఉంది. కానీ ఆగస్టు 2వ తేదీన పార్టీలో చేరుతార‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయ‌నతో పాటు పలు వ్యాపార సంస్థలలో కీల‌క స్థానాల్లో ఉన్న గ్రూప్ కూడా పార్టీలో చేరాల‌ని భావిస్తోంద‌ని తెలుస్తోంది.

తెలంగాణలో టీడీపీ మళ్లీ ఫామ్ లోకి వస్తుంది.. యువత కోసం ఉండాల్సిందే.. చంద్రబాబు

రాజ‌కీయ నేత‌ల‌నే కాకుండా అన్ని వ‌ర్గాల్లో పేరున్న వారిని పార్టీలోకి తీసుకురావాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు సూచించారు. మాజీ పోలీస్ ఆఫీస‌ర్ గా ఉన్న కృష్ణ ప్ర‌సాద్.. పేదలకు సహాయం చేసే సామాజిక సేవా సంస్థను నడుపుతూ దానికి అనుబంధంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. 

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ పనుల్లో ఘోర ప్రమాదం, ఐదుగురు కూలీలు మృతి..

ఇప్పటికే ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్ల‌ను బీజేపీ తన వైపున‌కు తిప్పుకుంది. ఎక్సైజ్ శాఖ కమిషనన‌ర్ గా ఉద్యోగ విర‌మ‌ణ చేసిన ఆర్ చంద్ర వదన్, కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఏపీలో పనిచేసిన తెలుగు అధికారి రత్న ప్రభ చాలా కాలం క్రితం పార్టీలో చేరారు. హైదరాబాద్ లో బీజేపీలో చేరిన ఆమె తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సా ర్సీపీ అభ్యర్థిపై పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా పార్టీలో చేరారు. ఈ మాజీ బ్యూరోక్రాట్లతో పాటు ఉద్యో గుల సంఘం నాయకుడు, తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ ను, అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డిని త‌న వైపున‌కు ఆకర్షించింది.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు : మైనర్లను మేజర్లుగానే పరిగణించాలి..జువైనల్ బోర్డుకు విజ్ఞప్తి

ఇదిలా వుండగా.. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ పై ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన నాయకులను లాక్కోవడంతో కాషాయ దళం కాంగ్రెస్ నుండి గట్టి పోటీనే ఎదుర్కొంటోంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఆగస్టు నుంచి శుభ ముహూర్తాలు అవుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు కాషాయ బీజేపీలో చేర‌తార‌ని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ రెండు పార్టీలో ఉన్న ముఖ్య‌మైన నేత‌లు బీజేపీ కండువా కప్పుకుంటార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు