లవ్ లెటర్ రాసి.. విద్యార్థిని ఆత్మహత్య

By ramya neerukondaFirst Published Sep 22, 2018, 4:53 PM IST
Highlights

ఇందుకు ఆమె చనిపోవడానికి ముందు రాసిన ఉత్తరమే సాక్ష్యం. ప్రేమ లేఖనే సూసైడ్ లెటర్ గా రాసి కాలేజీ భవనం పై నుంచి దూకేసింది.

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్న అనూష కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమ వ్యవహారం కారణంగానే విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు ఆమె చనిపోవడానికి ముందు రాసిన ఉత్తరమే సాక్ష్యం. ప్రేమ లేఖనే సూసైడ్ లెటర్ గా రాసి కాలేజీ భవనం పై నుంచి దూకేసింది.

ఆమె పుస్తకంలో లభించిన ఈ లెటర్ ని కాలేజీ యాజమాన్యం పోలీసులకు అందజేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

click me!