ఊయ్యాలే ఉరితాడై.. విలవిలలాడుతూ ప్రాణాలు విడిచిన చిన్నారి

Siva Kodati |  
Published : Aug 30, 2022, 08:19 PM IST
ఊయ్యాలే ఉరితాడై.. విలవిలలాడుతూ ప్రాణాలు విడిచిన చిన్నారి

సారాంశం

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటకు చెందిన చిన్నారి ఉయ్యాల తాడు మెడకు బిగియడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాప మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉయ్యాల తాడు మెడకు చుట్టుకుని పసికందు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..  గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దిలీప్ దంపతులకు సంవత్సరం క్రితం పాప పుట్టింది. చిన్నారి కోసం ఊయ్యాల కట్టారు. అయితే మంగళవారం అది తిరిగి పాప మెడకు బిగియడంతో ఊపిరాడక చిన్నారి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయింది. పాప ఏడుపు విని పక్క గదిలో ఉన్న కుటుంబసభ్యులు పరుగు పరుగున వచ్చారు. వెంటనే ఆమెను తీసుకుని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో పాప మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాప మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్