మధిరలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ పై దాడి: ఫ్లెక్సీల చించివేత

By narsimha lodeFirst Published May 28, 2023, 2:45 PM IST
Highlights

ఉమ్మడి  ఖమ్మం  జిల్లాలోని  మధిరలో  మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  కార్యాలయంపై  ఇవాళ  గుర్తు తెలియని దుండగులు దాడి  చేశారు. 

ఖమ్మం: ఉమ్మడి  ఖమ్మం  జిల్లాలోని  మధిరలో  ఆదివారంనాడు  మాజీ ఎంపీ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  కార్యాలయంపై  గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  కార్యాలయం  ముందు  ఏర్పాటు  చేసిన  ఫ్లెక్సీని  చింపివేశారు.  మరో వైపు   కార్యాలయంలోని  పూలకుండీలను  ధ్వంసం  చేశారు. ఈ సమయంలో  ఈ కార్యాలయంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు  ఎవరూ  ఈ కార్యాలయంలో  లేరు.

మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ పై  సోషల్ మీడియాలో  అనుచిత వ్యాఖ్యలు  చేశారని  ఆరోపిస్తూ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  అనుచరుడిపై  ఖమ్మంలో    బీఆర్ఎస్  శ్రేణులు  దాడికి దిగారు. మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి   గత కొంతకాలంగా  బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు  చేస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో  ఖమ్మం  జిల్లాలో  ఒక్క సీటు కూడా రాకుండా  తన శక్తివంచన లేకుండా కృషి  చేస్తానని ప్రకటించారు.  మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ పై  కూడా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  విమర్శలు  చేశారు.  పువ్వాడ అజయ్ కుమార్ కూడా  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై  విమర్శలు  చేశారు. 

మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి ని బీజేపీ, కాంగ్రెస్ లలో  చేరాలని  ఆ పార్టీలు  ప్రయత్నిస్తున్నాయి.  అయితే  ఈ రెండు  పార్టీల్లో  ఏ పార్టీలో  చేరే విషయమై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఇంకా స్పష్టత  ఇవ్వలేదు.  కానీ  ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో 
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తన అనుచరులతో  సమావేశాలు  నిర్వహిస్తున్నారు. 

click me!