షర్మిల క్యాంప్ లో చేరిన మరో మహిళా కాంగ్రెస్ నేత.. !

By AN TeluguFirst Published Apr 6, 2021, 11:58 AM IST
Highlights

తెలంగాణలో రాజన్న రాజ్యం పేరుతో కొత్తపార్టీ పెట్టడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిల గూటికి మరో తెలంగాణ కాంగ్రెస్ నేత చేరారు. 

తెలంగాణలో రాజన్న రాజ్యం పేరుతో కొత్తపార్టీ పెట్టడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిల గూటికి మరో తెలంగాణ కాంగ్రెస్ నేత చేరారు. 

మహిళా కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు అచ్యుత యాదవ్ పార్టీ పదవికి రాజీనామా చేసి షర్మిలకు మద్దతు పలికారు. ఈ మేరకు సోమవారం ఆమె లోటస్ పాండ్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. 

అలాగే కరీంనగర్ మంథనికి చెందిన ఒకరు, నారాయణ్‌పేట్‌ జిల్లా మక్తల్‌కు చెందిన ఆరుగురు మాజీ సర్పంచ్‌లు, పలువురు న్యాయవాదులు షర్మిలను కలిసి మద్దతు మద్దతు తెలిపినట్లు వెల్లడించింది.

click me!