దీక్షిత్ రెడ్డి హత్య కేసులో ముద్దాయి సాగర్ కు మరణశిక్ష...

Published : Sep 29, 2023, 01:19 PM IST
దీక్షిత్ రెడ్డి హత్య కేసులో ముద్దాయి సాగర్ కు మరణశిక్ష...

సారాంశం

డబ్బుల కోసం మైనర్ బాలుడిని కిరాతకంగా హతమార్చిన వ్యక్తికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది మహబూబాబాద్ కోర్టు. 

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కోర్టు ఓ హత్య కేసులో సంచలన తీర్పునిచ్చింది. 9యేళ్ల బాలుడు దీక్షిత్ ను అత్యంత కిరాతకంగా హతమార్చిన ముద్దాయి సాగర్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సాగర్ 9యేళ్ల బాలుడి దీక్షిత్ ను డబ్బుల కోసం హతమార్చాడు. దీక్షిత్ ను కిడ్నాప్ చేసిన సాగర్.. ఓ యాప్ తో గొంతుమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను డబ్బులు  డిమాండ్ చేశాడు. 

సాగర్ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. బాలుడు అదృశ్యమవ్వడంతో వెతుకుతున్న తల్లిదండ్రులతో పాటూ తానూ వెతుకుతున్నట్లు నటిస్తూ.. వారితో కలిసి తిరిగాడు. అనుమానంతో పోలీసులు విచారించగా.. అతనే నిందితుడిగా తేలాడు. 
 

PREV
click me!

Recommended Stories

Summer Effect: తెలంగాణ లో ఈ జిల్లాలకు అలెర్ట్ రానున్న మూడు రోజుల్లో తీవ్ర వేడి | Asianet News Telugu
Job Mela 2026 : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. మే 2026 లో భారీ ఉద్యోగాల భర్తీ.. ఏరోజు, ఏ జిల్లాలో, ఎన్ని జాబ్స్..?