హైదరాబాద్ లో మైనర్ బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు.. పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..

By team teluguFirst Published Nov 23, 2022, 1:59 PM IST
Highlights

మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ టీచర్ కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 45 వేలు జరిమానా విధించింది. 

హైదరాబాద్ లో మైనర్ బాలుడిపై ఓ టీచర్ నాలుగేళ్ల కిందట లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. ఆ టీచర్ కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. 2018 సంవత్సరంలో సరూర్‌నగర్‌లోని తన ఇంట్లో 15 ఏళ్ల బాలుడిని 49 ఏళ్ల ప్రైవేట్ టీచర్ పలుమార్లు లైంగికంగా వేధించాడు.

మంగళూరు, కోయంబత్తూరు పేలుళ్లు.. కేరళతో సంబంధాలు వెలుగులోకి.. !

ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు. అయితే ఈ దారుణాన్ని బాలుడు తన తండ్రికి చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి సరూర్‌నగర్ పోలీసులకు 2018 జూన్ 2న ఫిర్యాదు చేశారు. అంతకు ముందు రోజు తన కుమారుడు ట్యూషన్ కు వెళ్తుండగా టీచర్ అడ్డగించి లైంగికంగా వేధించాడని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 377, పోక్సో చట్టంలోని సెక్షన్ 4, 12 కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో తీర్పు వచ్చింది. జైలు శిక్షతో పాటు 45 వేలు చెల్లించాలని కూడా ఆదేశించింది. 

click me!