బ్రేకింగ్: బావిలోకి దూసుకెళ్లిన జీపు.. వాహనంలో 15 మంది

By Siva KodatiFirst Published Oct 27, 2020, 6:13 PM IST
Highlights

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సంగెం మండలం గవిచర్లలో ఓ ప్యాసింజర్ జీపు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన గ్రామస్తులు ఎంతో శ్రమించి 12 మందిని రక్షించగా, మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సంగెం మండలం గవిచర్లలో ఓ ప్యాసింజర్ జీపు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన గ్రామస్తులు ఎంతో శ్రమించి 12 మందిని రక్షించగా, మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

click me!