దారుణం : ఆరేళ్ల చిన్నారిపై 60యేళ్ల వృద్ధుడి కామవాంఛ, అత్యాచారం

By AN TeluguFirst Published Aug 26, 2021, 9:57 AM IST
Highlights

ఇంట్లో పెద్దవాళ్లెవరూ లేకపోవడంతో, ప్రతీరోజూ చిన్నారిని ఇలాగే వదిలి కూలీ పనికి వెడుతుంటారు. ఆ చిన్నారి కూడా తల్లిదండ్రులు పనులకు వెళ్లాక చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటూ ఉండేది. ఇది ఆ చిన్నారి ఎదురింట్లో ఉండే బాణోతు దీప్లానాయక్‌(60) గమనించాడు. ఆ చిన్నారి మీద దుర్మార్గుడి డేగ కళ్లు పడ్డాయి. 

నేలకొండపల్లి : ఖమ్మంలో దారుణం జరిగింది. అభం, శుభం తెలియని ఆరేళ్ల చిన్నారి మీద ఓ వృద్దుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. వావి వరసలు మరిచి, వయసు తేడాలు మరిచి... తన మునిమనవరాలి వయసున్న చిన్నారిని వంకరబుద్దితో చూశాడు. 

వివరాల్లోకి వెడితే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, మోటాపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మోటాపురం పెద్ద తండాకు చెందిన భార్యభర్తలు తమ ఆరేళ్ల చిన్నారిని ఇంటి దగ్గర వదిలి కూలీ పనికి వెళ్లారు. 

ఇంట్లో పెద్దవాళ్లెవరూ లేకపోవడంతో, ప్రతీరోజూ చిన్నారిని ఇలాగే వదిలి కూలీ పనికి వెడుతుంటారు. ఆ చిన్నారి కూడా తల్లిదండ్రులు పనులకు వెళ్లాక చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటూ ఉండేది. ఇది ఆ చిన్నారి ఎదురింట్లో ఉండే బాణోతు దీప్లానాయక్‌(60) గమనించాడు. ఆ చిన్నారి మీద దుర్మార్గుడి డేగ కళ్లు పడ్డాయి. 

అంతే చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సాయంత్రం కూలీ పనులకు వెళ్లొచ్చాక ఆమె తల్లిదండ్రులకు చిన్నారి కనిపించలేదు. దీంతో గ్రామం అంతా వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కన్నీళ్ల పర్యంతమవుతుండగా చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో అనుమానంతో దీప్లానాయక్ ఇంట్లోకి వెళ్లి చూశారు. 

అక్కడ తమ చిన్నారి వివస్త్రగా పడి ఉంది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. తమ కూతురు మీద దీప్లానాయక్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, ఫొక్సో కేసు నమోదు చేశామని నేలకొండపల్లి ఎస్ఐ అశోక్‌రెడ్డి తెలిపారు. కాగా, బాలికను మెరుగైనా వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. 
 

click me!