శనిగపురంలో దారుణం... కుప్పలు కుప్పలుగా కోతుల మృతదేహాలు

Arun Kumar P   | Asianet News
Published : Nov 18, 2020, 12:57 PM IST
శనిగపురంలో దారుణం... కుప్పలు కుప్పలుగా కోతుల మృతదేహాలు

సారాంశం

కోతులన్నీ విష ప్రయోగం తో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. 

మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారులో కోతుల మృతదేహాలు గుట్టగా బయటపడ్డాయి. రాత్రి గుర్తు తెలియని దుండగులు కోతుల మృతదేహాలను ఇక్కడ పడేయగా పొద్దునే గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు కోతుల మృతదేహాలను పరిశీలించారు. ఈ కోతులన్నీ విష ప్రయోగం తో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 60 కోతులను బస్తాల్లో నింపి ఇక్కడకు తీసుకువచ్చి పొదల్లో వదిలి వెళ్ళి వుంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా