కబడ్డీ పోటీల్లో అపశృతి: సూర్యాపేటలో కుప్పకూలిన గ్యాలరీ, 60 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Mar 22, 2021, 7:21 PM IST
Highlights

 సూర్యాపేటలో  సోమవారం నాడు ప్రమాదం చోటు చేసుకొంది. 47వ, జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమైన ఆరు నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకొంది
 

సూర్యాపేట:  సూర్యాపేటలో  సోమవారం నాడు ప్రమాదం చోటు చేసుకొంది. 47వ, జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమైన ఆరు నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకొంది. కబడ్డీ పోటీల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. .ఈ ప్రమాదంలో 60 మంది గాయాలయ్యాయి.

సోమవారం నాడు జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు సూర్యాపేటలో ప్రారంభమయ్యాయి.ఈ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మూడో నెంబర్ గ్యాలరీ కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీలో 1500 మంది ప్రేక్షకులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన 20 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

కబడ్డీ పోటీలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకొంది. గ్యాలరీ కూలిపోవడంతో కొందరికి ఇనుప చువ్వలు గుచ్చుకొని తీవ్రంగా గాయపడినట్టుగా చెబుతున్నారు. రెయిలింగ్ కింద  కొందరు ప్రేక్షకులు చిక్కుకొన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రెయిలింగ్ పై సామర్ధ్యం కంటే కూర్చోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. నాలుగు వైపులా  15 వేల మంది కూర్చొని ఆటలను తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తూర్పువైపున ఉన్న గ్యాలరీపై సామర్ధ్యం కంటే ఎక్కువ మంది కూర్చోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని చెబుతున్నారు.
 

click me!