కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం, మృతుల్లో ఇద్దరు చిన్నారులు

By Siva KodatiFirst Published Dec 18, 2021, 2:30 PM IST
Highlights

కామారెడ్డి (kamareddy district) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. 

కామారెడ్డి (kamareddy district) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బిచ్చుంద మండలం జగన్నాథపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా వున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

click me!