కొత్తగా 569 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,48,957కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Aug 07, 2021, 09:39 PM IST
కొత్తగా 569 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,48,957కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 569 కరోనా కేసులు నమోదవ్వగా.. నలుగురు మృతి చెందారు.  657 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 8,582 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,05,201 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 569 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,48,957కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ సోకి మరణించిన వారి సంఖ్య 3,823కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 657 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 8,582 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 17, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 22, జనగామ 11, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 0, కామారెడ్డి 4, కరీంనగర్ 64, ఖమ్మం 40, మహబూబ్‌నగర్ 7, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 11, మంచిర్యాల 17, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 33, ములుగు 7, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 39, నారాయణపేట 1, నిర్మల్ 2, నిజామాబాద్ 8, పెద్దపల్లి 27, సిరిసిల్ల 19, రంగారెడ్డి 27, సిద్దిపేట 18, సంగారెడ్డి 9, సూర్యాపేట 15, వికారాబాద్ 3, వనపర్తి 2, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 51, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి.  
 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?