రిమ్మనగూడ వద్ద రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

By narsimha lodeFirst Published Sep 14, 2018, 4:47 PM IST
Highlights

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు


గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా వర్గల్ మండలం పాములపర్తికి చెందినవారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద టాటా ఏస్ , లారీ ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మృతులు వర్గల్ మండలంలోని పాములపర్తి వాసులుగా గుర్తించారు.

ఈ ఘటనలో గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 20 మంది టాటా ఏస్ వాహనంలో నాగపూర్ గ్రామంలో చావుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఆటోను వెనుక నుండి ఢీకొట్టింది.దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 
 

click me!