తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. 6,78,688కి చేరిన సంఖ్య , హైదరాబాద్‌లో అత్యధికం

By Siva KodatiFirst Published Dec 14, 2021, 10:30 PM IST
Highlights

తెలంగాణ (Telangana)లో కొత్తగా 210 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 213 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,883 యాక్టివ్‌ కేసులు వున్నాయి
 

తెలంగాణ రాష్ట్రంలో (Telangana) గడిచిన 24 గంటల్లో 40,997 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 210 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,78,688కి చేరింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్ వల్ల (corona deaths in telangana)  ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,009కి చేరుకుంది. నిన్న కోవిడ్ నుంచి 213 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,833 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి  80 మంది చేరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. వీరికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ కొవిడ్‌ నిర్ధారణ కాలేదు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 5,396 మంది తెలంగాణకు వచ్చారు. వారిలో 18 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ 18 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. ఇప్పటివరకు 15 మందికి నెగెటివ్‌గా తేలగా.. మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 87, జగిత్యాల 4, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 2 కామారెడ్డి 0, కరీంనగర్ 5, ఖమ్మం 9, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 5, మంచిర్యాల 2, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 18, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 8, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 0, పెద్దపల్లి 5, సిరిసిల్ల 3, రంగారెడ్డి 12, సిద్దిపేట 4, సంగారెడ్డి 3, సూర్యాపేట 4, వికారాబాద్ 1, వనపర్తి 0, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 21, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.  
 

Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.14.12.2021 at 5.30pm) pic.twitter.com/mrTeSSA5gZ

— IPRDepartment (@IPRTelangana)
click me!