రైలు ప్రయాణీకులకు శుభవార్త.. సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు.. నేటినుంచే రిజర్వేషన్...

Published : Dec 31, 2022, 08:07 AM IST
రైలు ప్రయాణీకులకు శుభవార్త.. సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు.. నేటినుంచే రిజర్వేషన్...

సారాంశం

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరో 16 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి జనవరి 7 నుంచి జనవరి 18 వరకు నడుస్తాయి. 

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే బంపర్ ఆపర్ ఇచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని 16 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ రైల్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి ప్రత్యేక రైళ్లు జనవరి 7 నుంచి అందుబాటులో ఉంటాయి. అప్పటినుంచి జనవరి 18వరకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ల మధ్య ఈ రైళ్లు తిరుగుతాయి. 

హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక రైళ్లు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తిరుపతి, విశాఖపట్నం.. తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 8 గంటల నుంచే ఈ ప్రత్యేక రైళ్లలో ముందుగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరాలు తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu