రైలు ప్రయాణీకులకు శుభవార్త.. సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు.. నేటినుంచే రిజర్వేషన్...

Published : Dec 31, 2022, 08:07 AM IST
రైలు ప్రయాణీకులకు శుభవార్త.. సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు.. నేటినుంచే రిజర్వేషన్...

సారాంశం

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరో 16 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి జనవరి 7 నుంచి జనవరి 18 వరకు నడుస్తాయి. 

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే బంపర్ ఆపర్ ఇచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని 16 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ రైల్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి ప్రత్యేక రైళ్లు జనవరి 7 నుంచి అందుబాటులో ఉంటాయి. అప్పటినుంచి జనవరి 18వరకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ల మధ్య ఈ రైళ్లు తిరుగుతాయి. 

హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక రైళ్లు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తిరుపతి, విశాఖపట్నం.. తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 8 గంటల నుంచే ఈ ప్రత్యేక రైళ్లలో ముందుగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరాలు తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టేయండి.. జూన్ 28న ప్రతీ పేరెంట్ చేయాల్సిన పని ఇదే
Heavy Rain Alert : రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే