
తెలంగాణలో (Telangana) గడచిన 24 గంటల్లో 26,625 మంది కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 146 మందికి (corona cases) పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 189 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు (corona deaths in telangana) వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,78,288కి చేరుకుంది. తాజా రికవరీలతో కలిపి రాష్ట్రంలో 6,70,435 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 3,846 యాక్టీవ్ కేసులున్నాయి. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 4,007కి చేరుకుంది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 0, జీహెచ్ఎంసీ 72, జగిత్యాల 1, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 7, ఖమ్మం 7, మహబూబ్నగర్ 1, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 5, మంచిర్యాల 0, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 3, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 2, పెద్దపల్లి 1, సిరిసిల్ల 1, రంగారెడ్డి 20, సిద్దిపేట 4, సంగారెడ్డి 0, సూర్యాపేట 1, వికారాబాద్ 0, వనపర్తి 0, వరంగల్ రూరల్ 3, హనుమకొండ 7, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.