
తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 30,050 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు (corona cases) నిర్వహించగా.. కొత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బాడిన వారి సంఖ్య 6,68,833కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఒక రోజు వ్యవధిలో కరోనాతో ఒకరు మృతి చెందారు. వీటితో కలిపి రాష్ట్రంలో వైరస్ వల్ల (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,937కి చేరింది. మహమ్మారి బారి నుంచి నిన్న 187 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,979 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 29, జగిత్యాల 1, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 9, ఖమ్మం 11, మహబూబ్నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 0, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 6, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 2, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 5, పెద్దపల్లి 3, సిరిసిల్ల 3, రంగారెడ్డి 8, సిద్దిపేట 4, సంగారెడ్డి 2, సూర్యాపేట 0, వికారాబాద్ 0, వనపర్తి 0, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 2, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.