ఆర్టీసీ బస్సుకు విద్యుత్ షాక్: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

Published : Jun 30, 2021, 02:41 PM ISTUpdated : Jun 30, 2021, 03:33 PM IST
ఆర్టీసీ బస్సుకు విద్యుత్ షాక్: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

సారాంశం

ఆర్టీసీ బస్సుకు విద్యుత్  షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.

హైదరాబాద్:  ఆర్టీసీ బస్సుకు విద్యుత్  షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.కల్వకుర్తి నుండి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ వాటిల్లింది.  ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణీకులున్నారు.

కల్వకుర్తి నుండి అచ్చంపేటకు వెళ్తున్న సమయంలో  బస్సుపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో  బస్సులో కూర్చొన్న 50 ఏళ్ల నర్సమ్మ అనే మహిళ విద్యుత్ షాక్ తో మరణించింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు అందాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?