మే 1 నుంచి వన్‌ప్లస్ ఫోన్‌ల అమ్మకాలు ఆగిపోతాయా? కంపెనీ ఎం చెప్తుందంటే.. ?

By Ashok kumar SandraFirst Published Apr 22, 2024, 8:11 PM IST
Highlights

 మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ORA) OnePlus టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్‌కు ఫిర్యాదు చేసింది.
 

 చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించబోమని భారతదేశంలోని రిటైల్ డిస్ట్రిబ్యూటర్ల స్టాండ్‌పై వన్‌ప్లస్ స్పందించింది. గత వారం రోజులుగా ఈ సమస్య వెనుక కంపెనీ ఉంది. 

దేశంలోని డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, గత ఏడేళ్లుగా నమ్మకమైన రిటైల్ పార్ట్నర్స్  నుండి లభించిన స్పోర్ట్ కు OnePlus వాల్యూ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

మే 1 నుండి పూర్విక మొబైల్స్ అండ్  సంగీత మొబైల్స్‌తో సహా భారతదేశం అంతటా 4,500 Brick and mortar స్టోర్స్  వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా   ఇతర ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తాయని గతంలో నివేదించబడింది. 

గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి OnePlus ఫోన్‌లు రీకాల్ చేయబడుతున్నాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ORA) OnePlus టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్‌కు ఫిర్యాదు చేసింది.

మార్కెట్లోని పలు ఆందోళనలను ఎత్తిచూపుతూ ఈ ఫిర్యాదు జరిగింది. ఇందులో లభాల తగ్గుదల, వారంటీ క్లెయిమ్‌లలో జాప్యాన్ని ఫిర్యాదు ఎత్తి చూపింది. దీని తర్వాత, OnePlus పై తక్కువ లాభాల మార్జిన్‌లతో ఆఫ్‌లైన్ స్టోర్ పార్ట్నర్లు  అసంతృప్తిగా ఉన్నారని ఒక నివేదిక వెలువడింది.

 తరువాత, వన్‌ప్లస్ ఉత్పత్తులను ఉపసంహరించుకునే నిర్ణయంతో స్టోర్స్  ముందుకు సాగుతున్నాయని గత నివేదికలు తెలిపాయి. చివరికి వారంటీ క్లెయిమ్‌లలో జాప్యం గురించి అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి OnePlus సిద్ధంగా ఉందని అసోసియేషన్ ఆరోపించింది.

click me!