అందులో బ్రిటన్, జపాన్ తర్వాత ఇండియా.. టాప్ లో యూఏఈ, దక్షిణ కొరియా..

By Ashok kumar SandraFirst Published Dec 30, 2023, 7:14 PM IST
Highlights

నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు 5G పరిశోధన, మౌలిక సదుపాయాల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడంలో బిజీగా ఉన్నాయి. 
 

లండన్ : 5జీ నెట్ వర్క్ స్పీడ్ లో భారత్ జపాన్, బ్రిటన్ లను అధిగమించింది. స్పీడ్ టెస్ట్ సైట్ 'ఊక్లా' నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఏడాది వ్యవధిలో భారత్ 72 స్థానాలు ఎగబాకింది. ప్రస్తుతం భారత్ టాప్ 10వ స్థానంలో ఉంది. యూఏఈ, దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉన్నాయి. మలేషియా మూడో స్థానంలో ఉంది. ఖతార్, బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్, కువైట్, మకావు అండ్  సింగపూర్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంకా వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చబోతున్నాయి. 5G అనేది హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందించే టెక్నాలజీ. నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రస్తుతం 5G కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాయి. 

ప్రస్తుతం చాలా మంది 4జీని ఉపయోగిస్తున్నారు. 5G ఇంటర్నెట్ మంచి స్పీడుతో ఉంటుంది. ప్రస్తుత మొబైల్ టవర్ల వంటి వ్యవస్థలను ఉపయోగించి ప్రపంచంలో 5G అమలు చేయబడదు. అందువల్ల, కొత్త 5G టవర్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

Latest Videos

5G టవర్ల విస్తరణ ఒక ప్రాంతానికి పరిమితం చేయబడుతుంది. దీనినే సెల్ టవర్ అంటారు. 5G నెట్ వర్క్  4G కంటే తక్కువ వేవ్ లెన్త్  అండ్ అధిక ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తుంది. 4G 1–6 GHz  ఫ్రీక్వెన్సీల వద్ద పనిచేస్తుండగా 5G 24 నుండి 90 GHz ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. అనేక 5G టవర్లను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. 

నిపుణులు 5G చుట్టూ ఉన్న హైప్ చాలా వరకు నిరాధారమైన కుట్ర సిద్ధాంతాలు అని అభిప్రాయపడుతున్నారు. 2019 లో, ప్రసిద్ధ US పాప్ సంగీతకారుడు కెరీ హిల్సన్ కోవిడ్ వ్యాప్తి వెనుక 5G ఉందని ట్వీట్ చేశారు. నివేదికల ప్రకారం, ఈ ట్వీట్ 5G గురించి భయాలను పెంచింది.

click me!