చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ నుంచి విడివడి స్వతంత్ర బ్రాండ్ ఏర్పరుచుకున్న పొకో విపణిలోకి రెండో మోడల్ ఫోన్ ఎక్స్2ను విడుదల చేసింది. ఇది ఈ నెల 11వ తేదీ నుంచి ఫ్లిప్ కార్టులో అందుబాటులోకి రానున్నది.
స్మార్ట్ ఫోన్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పోకో ఎక్స్2’ మొబైల్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ నుంచి విడిపోయి ఇండిపెండెంట్ బ్రాండ్గా మారాక పోకో నుంచి వస్తున్న తొలి మొబైల్ కావడంతో ‘ఎక్స్2’ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.
డిజైన్ పరంగా ఈ ఫోన్ను రెడ్మీ కె30ను పోలి ఉన్నా కొన్ని ఆసక్తికర మార్పులు చేసినట్లు పొకో తెలిపింది. పోకో ఎక్స్2ను మూడు వేరియంట్లో అందుబాటులోకి తేనున్నారు. 6జీబీ ర్యామ్/64జీబీ విత్ ఇంటర్నల్ మెమొరీ, 6జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది.
ముందు, వెనక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ను అమర్చిన పోకొ ఎక్స్2 ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (1080x2340 పిక్సెల్) రియాల్టీ ఫ్లో 120హెడ్జ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఎల్సీడీ ప్యానెల్ ఇంటెలిజెంట్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ టెక్నాలజీతో ఈ డిస్ప్లే పనిచేస్తుంది.
ఇందులో మొబైల్లో ఆక్టాకోర్ క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 730జీ ప్రాసెసర్ను ఉపయోగించారు. లిక్విడ్ కూల్ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ హీట్ను అదుపులో ఉంచనున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత ఎమ్ఐయుఐ 11తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో వెనుక భాగంలో నాలుగు, ముందు రెండు కెమెరాలను అమర్చారు.
వెనకవైపు సోనీ ఐఎమ్ఎక్స్ 686 సెన్సర్తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇస్తున్నారు. దాంతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీ కోసం 20 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ కెమెరాను అందుబాటులో ఉంచారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.
పోకో ఎక్స్2 6జీబీ/64జీబీ వేరియంట్ ధరను రూ.15,999గా నిర్ణయించారు. 6జీబీ/128జీబీ వేరియంట్ను రూ.16,999కు అందిస్తున్నారు. 8జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ.19,999. అట్లాంటిస్ బ్లూ, మాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్ రంగుల్లో ఈ మొబైళ్లు లభ్యమవుతాయి. ఈ నెల 11న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.