వేలల్లో రిలయన్స్ జియో ఉద్యోగులు రాజీనామా.. గత ఏడాదితో పోలిస్తే భారీ పెరుగుదల...: నివేదికల వెల్లడి

By asianet news teluguFirst Published Aug 11, 2023, 9:29 PM IST
Highlights

రిలయన్స్ కూడా రాజీనామా చేసే ఉద్యోగుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొత్తగా రిక్రూట్‌మెంట్లు చేసింది. కంపెనీ FY2023లో వివిధ వ్యాపారాలలో 262,558 మంది ఉద్యోగులను నియమించుకుంది. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించడం రిలయన్స్ వ్యూహంలో భాగమని కూడా సమాచారం.
 

ఢిల్లీ : 2022-23 మధ్య కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి రాజీనామా చేసే ఉద్యోగుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. జియోకు చెందిన 41,000 మంది ఉద్యోగులు, రిలయన్స్ రిటైల్‌కు చెందిన 100,000 మంది కంపెనీలకు రాజీనామా చేశారు. కంపెనీ వార్షిక నివేదికల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల తొలగింపులో 64.8 శాతం పెరుగుదల నమోదైంది. రిలయన్స్ కింద జియో రిటైల్ అండ్ టెలికాం విభాగాల నుండి అట్రిషన్ పెరిగింది.

మొత్తంగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 1,67,391 మంది ఉద్యోగులు రిలయన్స్‌ నుండి వైదలగారు. ఇందులో రిటైల్ సెగ్మెంట్ నుండి 1,19,229 ఇంకా జియో నుండి 41,818 ఉన్నారు. జూనియర్ అండ్ మిడ్-మేనేజ్‌మెంట్ స్థాయిలలో అత్యధిక డ్రాపౌట్ ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

రిలయన్స్ కూడా రాజీనామా చేసే ఉద్యోగుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొత్తగా రిక్రూట్‌మెంట్లు చేసింది. కంపెనీ FY2023లో వివిధ వ్యాపారాలలో 262,558 మంది ఉద్యోగులను నియమించుకుంది. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించడం రిలయన్స్ వ్యూహంలో భాగమని కూడా సమాచారం.

ఈ సంవత్సరం మేలో, రిలయన్స్  ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ జియోమార్ట్ కూడా ఖర్చు తగ్గించే డ్రైవ్‌లో భాగంగా 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉండగా, రిలయన్స్ అన్యువల్ జనరల్ మీటింగ్  ఆగస్టు 28, 2023న జరగనుంది. ఈ సమావేశంలో జియో 5G ఫోన్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ ఇనాక్  కస్టమర్-సెంట్రిక్ జియో 5G ప్లాన్‌లతో సహా అనేక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

click me!