జియో మెగా ఆఫర్: డబుల్ డేటాతో ఆన్ లిమిటెడ్ కాలింగ్, మిలియనీర్ అయ్యే అవకాశం కూడా..

By asianet news teluguFirst Published Sep 7, 2022, 5:10 PM IST
Highlights

ఈ ప్లాన్ బెనెఫిట్స్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 11 వరకు ఆరు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్లాన్‌తో కస్టమర్‌లు రోజుకు 2.5జి‌బి డేటాతో డిస్ని+ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియో సుట్స్ యాప్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. 

దేశీయ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జియో ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ. 2,999 సంవత్సర వాలిడిటీతో మరో కొత్త రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌తో కంపెనీ ఆరేళ్లు పూర్తి చేసుకున్న ఆనందంలో కస్టమర్లకు ఆరు బెనెఫిట్స్ అందించబోతోంది. ఈ ప్లాన్ బెనెఫిట్స్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 11 వరకు ఆరు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్లాన్‌తో కస్టమర్‌లు రోజుకు 2.5జి‌బి డేటాతో డిస్ని+ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియో సుట్స్ యాప్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో లభించే బెనెఫిట్స్ గురించి తెలుసుకుందాం...

జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 2,999
జియో ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్‌లు 365 రోజుల వాలిడిటీ పొందుతారు. ఆలాగే రోజుకు 2.5జి‌బి హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ లభిస్తుంది. అంటే, కస్టమర్లు సంవత్సరం మొత్తంగా 912.5జి‌బి డేటా పొందుతారు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లభిస్తాయి. రూ. 2,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే ఎన్నో ఓ‌టి‌టి సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ వాలిడిటీ ఒక సంవత్సరం పాటు ఈ ప్లాన్‌తో  అందిస్తుంది. దీనితో పాటు JioCinema, JioTV, JioNews, JioSecurity, JioCloud యాప్‌ల వంటి Jio Suites యాప్స్ బెనెఫిట్స్ కూడా ఇస్తుంది. 

ఆరు సంవత్సరాలు ఆరు ప్రయోజనాలు
జియో రూ. 2,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్‌లు ఆరు ప్రయోజనాలను పొందుతారు. ఇందులో మీరు Ajio, Ixigo, Netmeds, Reliance Digital, Jio Saavn Pro ఉచిత కూపన్‌లతో పాటు రోజుకు 2.5GB డేటాతో పాటు 75జి‌బి  అదనపు డేటా కూడా పొందుతారు. 

10 లక్షల గిఫ్ట్ గెలుచుకునే అవకాశం
ఇండియాలో జియో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా సందర్భంగా కంపెనీ కస్టమర్ల కోసం మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది, ఇందులో జియో కస్టమర్లు రూ. 10 లక్షల వరకు రివార్డ్‌ను గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్‌లో పాల్గొనడానికి మీరు చేయాల్సిందల్ల మీ జియో నంబర్‌కు రీఛార్జ్ చేయడం. ఈ జియో ఆఫర్ సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 11 వరకు ఉంటుంది. ఇందులో జియో కస్టమర్‌లు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాలి, ఆ తర్వాత కస్టమర్‌లు రూ.10 లక్షల వరకు రివార్డ్‌ను గెలుచుకునే అవకాశం లభిస్తుంది. మీరు ఇంతకుముందే ఏదైనా రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ కొత్త రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అని గుర్తుంచుకోండి. అయితే మీ ప్రస్తుత పాత ప్లాన్ ముగిసిన తర్వాతే కొత్త ప్లాన్ యాక్టివ్‌ అవుతుంది. తమిళనాడు సర్కిల్ మినహా దేశవ్యాప్తంగా ఉన్న జియో కస్టమర్లు ఈ ఆఫర్‌లో పాల్గొనవచ్చు. 

click me!