ఫేస్‌బుక్ అలెర్ట్: పొరపాటున కూడా ఇలాంటి పోస్టులు చేయకండి.. లేదంటే జేలుకే..

By asianet news teluguFirst Published Dec 1, 2022, 1:26 PM IST
Highlights

తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టుకి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మీరు సోషల్ మీడియా యూజర్ అయితే, మీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి

డిజిటల్ ప్రపంచం ఇంకా సోషల్ మీడియా యుగంలో మీరు చాలా అలెర్ట్ గా ఉండాలి. ఇక్కడ ప్రజలు వారి ఆలోచనలు, ఫోటోలు ఇంకా వీడియోలను షేర్ చేస్తుంటారు, కానీ సోషల్ మీడియాలో ఒక పొరపాటు  మిమ్మల్ని జైలుకు కూడా పంపవచ్చు. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టుకి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మీరు సోషల్ మీడియా యూజర్ అయితే, మీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ చిన్న పొరపాటు కూడా మీకు భారీగా చెల్లించుకోవాల్సి వస్తుంది. మీకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే ఆ తప్పులు ఏమిటో తెలుసుకుందాం. 

ఇండియాలో కఠినమైన చట్టాలు
సోషల్ మీడియాలో సైబర్ చట్టాలను ఉల్లంఘిస్తే భారతదేశంలో కూడా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇండియాలో వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ దానికి పరిమితులు కూడా ఉన్నాయి. మీ పోస్ట్‌లు ఏవీ ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదని గుర్తుంచుకోవాలి. అలాగే, మీ పోస్ట్లు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదు. మీరు సైబర్ చట్టాన్ని ఉల్లంఘించేలా ఏదైనా పోస్ట్ చేస్తే ఐటీ నిబంధనల ప్రకారం మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.

ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000 ప్రకారం రూ.10 లక్షల వరకు జరిమానా ఇంకా జీవిత ఖైదు విధించే నిబంధన కూడా ఉంది. ఈ చట్టం ప్రకారం, ఒకరి అక్కౌంట్ హ్యాక్ చేయడం,  అశ్లీల ఫోటోలు వీక్షించడం, సృష్టించడం, పెట్టడం లేదా పంపడం, ఒకరి గుర్తింపును ఉపయోగించడం, వాక్‌స్వేచ్ఛను ఉల్లంఘించడం నేరం. 

సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయకండి
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పుడు, మీరు ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు ఏం షేర్ చేస్తున్నారు? మీ పోస్ట్ కరెక్టేనా ? మీ పోస్ట్ ఒకరి మనోభావాలను లేదా ఏదైనా సంఘం  భావాలను దెబ్బతీస్తుందా ? అలాగే అశ్లీల కంటెంట్‌ను షేర్ చేయడం  వంటి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పోస్ట్ చేయండి. 

ఫార్వార్డ్ చేసిన మెసేజెస్ లేదా పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం మానుకోండి. ఇంకా  పోస్ట్‌ను షేర్ చేసే ముందు  కన్ఫర్మేషన్ కోసం చెక్ చేయండి. అలాగే, దేశ వ్యతిరేక, మత వ్యతిరేక పోస్ట్ చేయడాన్ని నివారించండి. ఇలాంటి తప్పు చేస్తే జైలుకు వెళ్లవచ్చు. 

click me!