తప్పుడు వార్తలకు చెక్ పెట్టేందుకు ట్విట్టర్ కొత్త పాలసీ

Ashok Kumar   | Asianet News
Published : Feb 06, 2020, 02:38 PM ISTUpdated : Feb 06, 2020, 02:41 PM IST
తప్పుడు వార్తలకు చెక్ పెట్టేందుకు ట్విట్టర్ కొత్త పాలసీ

సారాంశం

ట్విట్టర్ మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో తప్పుదోవ పట్టించే వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది ప్రకటన చేసింది.  #TwitterPolicyFeedback అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి కొత్త విధానాన్ని  సంబంధించి ముందే ఇది వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించిందని తెలిపింది.

ట్విట్టర్ మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో తప్పుదోవ పట్టించే వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది ప్రకటన చేసింది.  #TwitterPolicyFeedback అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి కొత్త విధానాన్ని  సంబంధించి ముందే ఇది వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించిందని తెలిపింది.

బెంగళూరు: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ ఇప్పుడు కొత్తగా లేబలింగ్ ప్రారంభిస్తుంది. లేబలింగ్ ద్వారా తప్పుదోవ పట్టించే వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్‌ గట్టి చర్యలు తీసుకోబోతుంది.  ఇందులో భాగంగా ఇలాంటి తప్పుడు వార్తల ట్వీట్‌లకు ప్రత్యేక ముద్ర వేయనుంది. ట్విట్టర్లో ట్వీట్  చేసే ప్రతి వీడియో లేదా ఫోటోను లేబల్ చేస్తుంది. అందు వల్ల తప్పుడు వార్తలకు  వ్యాపించకుండా అరికట్టనుంది.

also read మేధో సంపత్తిలో భారత్ కన్నా గ్రీస్, రోమినియన్ రిపబ్లిక్ దేశాలు ముందు....

  “ప్రజల భద్రతను పై ప్రభావం చూపించే లేదా తీవ్రమైన హాని కలిగించే వీడియో లేదా ఫోటో ట్విట్లను వెంటనే తీసివేయబడతాయి అని తెలిపింది.ట్విట్టర్ "హాని" యొక్క నిర్వచనం ఒక వ్యక్తి లేదా సమూహం యొక్క భౌతిక భద్రతకు బెదిరింపులు లేదా సామూహిక హింస లేదా పౌర అశాంతి వంటి భౌతిక హానికి మించినది.

"హాని" యొక్క నిర్వచనంలో కూడా చేర్చబడింది గోప్యతకు బెదిరింపులు లేదా ఒక వ్యక్తి లేదా సమూహం తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి లేదా పౌర సంఘటనలలో పాల్గొనే సామర్థ్యం.తెలిసో తెలియకో తప్పుదోవ పట్టించేలా రూపొందించిన మీడియా, ట్వీట్‌లను షేర్‌ చేయదల్చుకునే యూజర్లను ముందస్తుగా హెచ్చరించేలా సాంకేతికతను ఉపయోగించనుంది.

also read ఫోన్ల ధరలు పెరుగనున్నాయి...ప్రత్యేకించి ఆపిల్ ‘ఐఫోన్’ కూడా....

మీడియాను మోసపూరితమైన రీతిలో పంచుకుంటే అది అంచనా వేస్తుంది. చివరగా, ఇది హాని యొక్క సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది.ట్విట్టర్ మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ ప్రకటన చేసింది. ఈ విషయం గురించి యూజర్లకు మరింత వివరంగా తెలిసేందుకు సదరు పోస్ట్‌లపై వివరణ పొందుపర్చనుంది. మార్చి 5 నుంచి తప్పుడు ట్వీట్లను లేబులింగ్‌ చేసే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ట్విటర్‌ వెల్లడించింది. 

#TwitterPolicyFeedback అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి కొత్త విధానాన్ని  కొన్ఫోర్మ్ చేయడానికి ముందే ఇది వినియోగదారు అభిప్రాయాన్ని సేకరించిందని తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్