వినియోగదారుల ఆన్ లైన్ పేమెంట్ డేటాను ఇతరులతో పంచుకోదు: గూగుల్ పే

By Sandra Ashok KumarFirst Published Sep 25, 2020, 4:39 PM IST
Highlights

కస్టమర్ పేమెంట్ సమాచారం, పూర్తి లావాదేవీల వివరాలు లేదా డేటాను థర్డ్ పార్టీలతో పంచుకోదు అని గూగుల్ శుక్రవారం తెలిపింది. ఎన్‌పిసిఐ, పేమెంట్ సర్వీస్ అందించే (పిఎస్‌పి) బ్యాంకుల ముందస్తు అనుమతితో థర్డ్ పార్టీలతో పేమెంట్ వివరాలను పంచుకునేందుకు అనుమతి ఉందన్న వార్తలపై  ఢీల్లీ హైకోర్టుకు గూగుల్ సమర్పించిన నివేదికలతో స్పష్టం చేసింది.

ఆన్ లైన డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే కస్టమర్ల పేమెంట్ డేటా పేమెంట్ వివరాలపై వివరణ ఇచ్చింది. కస్టమర్ పేమెంట్ సమాచారం, పూర్తి లావాదేవీల వివరాలు లేదా డేటాను థర్డ్ పార్టీలతో పంచుకోదు అని గూగుల్ శుక్రవారం తెలిపింది.

ఎన్‌పిసిఐ, పేమెంట్ సర్వీస్ అందించే (పిఎస్‌పి) బ్యాంకుల ముందస్తు అనుమతితో థర్డ్ పార్టీలతో పేమెంట్ వివరాలను పంచుకునేందుకు అనుమతి ఉందన్న వార్తలపై  ఢీల్లీ హైకోర్టుకు గూగుల్ సమర్పించిన నివేదికలతో స్పష్టం చేసింది.

"ఢీల్లీ హైకోర్టు ముందు గూగుల్ దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా పత్రికా నివేదికలు పూర్తి వాస్తవాలకు ప్రాతినిధ్యం వహించవని స్పష్టం అయ్యింది" అని గూగుల్ ప్రతినిధి శుక్రవారం చెప్పారు.

also read 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) జారీ చేసిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) విధానపరమైన మార్గదర్శకాలతో గూగుల్ పే పూర్తిగా పనిచేస్తుందని, వర్తించే చట్టాలు ఉన్నాయని, పేమెంట్ సమాచారం  ఏ థర్డ్ పార్టీతో కస్టమర్ లావాదేవీల డేటాను పంచుకోదు" అని ప్రతినిధి చెప్పారు.

డేటా స్థానికీకరణ, స్టోరేజ్, భాగస్వామ్యానికి సంబంధించిన ఆర్‌బిఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు గూగుల్ పేపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న పిఎల్‌కు ప్రతిస్పందనగా గూగుల్ చీఫ్ జస్టిస్ డి ఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలన్ ధర్మాసనం ముందు దాఖలు చేశారు.

సెంటర్‌ అండ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) తమ స్పందనలను ఇంకా దాఖలు చేయనందున నవంబర్ 10 న హైకోర్టు ఈ విషయాన్ని విచారణకు వాయిదా వేసింది.

click me!