సానియా మీర్జాకు షాక్..

Published : May 22, 2018, 02:21 PM IST
సానియా మీర్జాకు షాక్..

సారాంశం

వెంటనే తప్పుకోవాలి.. ఈ విషయంపై ప్రకటన ఇవ్వాలి

టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాకి ఊహించని షాక్ తగిలింది. ఆమె ఓ పౌల్ట్రీ( చికెన్) ప్రకటన ఇస్తున్న సంగతి అందిరికీ తెలిసిందే.  అయితే.. ఆ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ పేర్కొంది.

అడ్వైర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో సానియా మీర్జా అడ్వర్టైజ్మెంట్ ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని.. ప్రమాణాలకు తగినట్టుగా లేదని తెలిపింది. బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న సానియామీర్జా వెంటనే దాన్నుంచి తప్పుకోవాలని సూచించింది.

2014లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కోడిమాంసం ఉత్పత్తులపై ఇచ్చిన నివేదికను ఈ అడ్వైర్టైజ్మెంట్ అపహాస్యం చేసేట్టుగా ఉందని ఏఎస్‌సీఐ అధికారి తెలిపారు. దీనికనుగుణంగానే సానియామీర్జాను ప్రకటన నుంచి తప్పుకోవలసిందిగా ఆదేశించింది. అంతేగాక ఈ విషయమై బహిరంగ ప్రకటన చేయాలని సానియాకు సూచించారు.

ప్రకటనను మే 23లోగా ప్రకటనను వెనక్కి తీసుకోవాలి లేదా మార్పులు చేసి పునఃప్రసారం చేయాలని అఖిల భారత పౌల్ట్రీ రంగ అభివృద్ధి, సేవల సంస్థకు ఏఎస్‌సీఐ సూచించింది.

PREV
click me!

Recommended Stories

T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?