భారత్ కి మరో స్వర్ణం... రైఫిల్ విభాగంలో..

By telugu teamFirst Published Sep 3, 2019, 9:16 AM IST
Highlights

చైనాకి చెందిన కియాన్ యాంగ్- హోనన్ యు జంటను ఓడించి వీరు పతకాన్ని సాధించారు. భారత్ కి చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్- దివ్యాన్ష్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సాధించింది. 

భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ లో భారత్ సోమవారం రెండు పతకాలు సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో అపూర్వి చండేలా- దీపక్ కుమార్ జోడీ స్వర్ణం సాధించింది.

చైనాకి చెందిన కియాన్ యాంగ్- హోనన్ యు జంటను ఓడించి వీరు పతకాన్ని సాధించారు. భారత్ కి చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్- దివ్యాన్ష్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సాధించింది. 

click me!