
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం జమ అయ్యింది. 800 మీటర్ల పరుగు పందెంలో మంజీత్ సింగ్ స్వర్ణం సాధించాడు. ఇదే పోటీలో భారత్కు చెందిన మరో స్ప్రంటర్ జిన్స్ జాన్సన్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మంజీత్ సింగ్ 1.46:15 సెకన్లలో లక్ష్యాన్ని అందుకోగా, జాన్సన్ 1.46:35 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నాడు. తద్వారా స్వర్ణం, రజతం రెండూ భారత్ ఖాతాలో చేరినట్లయ్యింది.