మ్యారేజ్ డేకి ముందు విషాదం: అమెరికాలో తెలుగు టెక్కీ మృతి

By pratap reddyFirst Published Aug 22, 2018, 10:33 AM IST
Highlights

తెలుగు టెక్కీ మృదుల్ చెరుకుపల్లి ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో మరణించాడు. మ్యారేజీ డేకి ఒక రోజు ముందు విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయనకు భార్య సుష్మ (27), కూతురు రాజశ్రీ (6) ఉన్నారు.

డల్లాస్: తెలుగు టెక్కీ మృదుల్ చెరుకుపల్లి ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో మరణించాడు. మ్యారేజీ డేకి ఒక రోజు ముందు విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయనకు భార్య సుష్మ (27), కూతురు రాజశ్రీ (6) ఉన్నారు. 

ఈ నెల 20వ తేదీన ఆయన తన ఎనిమిదో వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. మృదుల్ డల్లాస్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గుండెపోటుతో ఆయన మృత్యువాత పడ్డాడు. 

మృదుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందినవాడు. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ఎన్నారై సంఘాలు, తెలుగు కమ్యూనిటీ కృషి చేస్తున్నాయి. 

click me!