క్రిస్మస్ నాడు కారు ఢీకొని అమెరికాలో రెండేళ్ల భారతీయ సంతతి చిన్నారి మృతి..

By SumaBala BukkaFirst Published Dec 31, 2022, 9:14 AM IST
Highlights

క్రిస్మస్ రోజు ఆదివారం మధ్యాహ్నం లాస్ వెగాస్ లో జరిగిన ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు.  

న్యూయార్క్ : అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో క్రిస్మస్ సందర్భంగా జరిగిన కారు ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన రెండేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. కాలిఫోర్నియాలోని ఇర్విన్‌కు చెందిన ఆరవ్ ముత్యాల మినీ వ్యాన్ బోల్‌ఓవర్ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో మరణించినట్లు లాస్ వెగాస్ రివ్యూ-జర్నల్ వార్తాపత్రిక నివేదించింది.

క్లార్క్ కౌంటీ కరోనర్ కార్యాలయం బుధవారం సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్ సమీపంలోని ఎడారిలో క్రిస్మస్ రోజు ప్రమాదానికి గురైన రెండేళ్ల బాలుడిని గుర్తించినట్లు పేర్కొంది. నెవాడా హైవే పెట్రోల్ ప్రకారం, లాస్ వెగాస్ బౌలేవార్డ్ సౌత్‌లో 12 వ నెంబర్ మైలురాయి వద్ద ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెవెన్ మ్యాజిక్ మౌంటెన్స్ స్థానికంగా చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడికి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. 

click me!