ముంబయి లోకల్ ట్రైన్‌లో సీటు కోసం శివాలెత్తిన మహిళలు.. జుట్లు పట్టుకుని వాదులాట (వీడియో)

By Mahesh KFirst Published Oct 7, 2022, 12:46 PM IST
Highlights

ముంబయి లోకల్ ట్రైన్ లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో సీటు కోసం ముగ్గురు మహిళల మధ్య ప్రధానంగా గొడవ జరిగింది. జుట్లు పట్టుకుని ఈడ్చుకుంటూ బాదుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి లోకల్ ట్రైన్‌ గురించి వచ్చే వార్తల్లో చాలా వరకు రద్దీ గురించే ఉంటాయి. ఆ లోకల్ ట్రైన్‌లో ఒకరిపై ఒకరు బరువేసి ప్రయాణిస్తున్నట్టుగానే ఉంటుంది. కోచ్‌లో ఊపిరాడని రీతిలో రద్దీ ఉంటుంది. తాజాగా, ఈ ట్రైన్‌లో ఓ మహిళ కోచ్‌లో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. థానె, పన్వెల్ మధ్య ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది.

మహిళలకు కేటాయించిన బోగీలో కొందరు మహిళలు సీటు కోసం ఏకంగా భౌతిక దాడికే దిగారు. సీటు కేంద్రంగా ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ గొడవ ఇతర మహిళలకూ వ్యాపించింది. జుట్లు పట్టుకుని ఈడ్చుకుంటూ గొడవ చేసుకునే దాకా చేరింది పరిస్థితి. ఇంతలో ఓ మహిళా కానిస్టేబుల్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు.

Fight between two female passengers over a seat in .

The woman police constable who went to the rescue got hurt.

Both women filed a case against each other at Vashi Railway Police Station. pic.twitter.com/nFOKv7bOWv

— Siraj Noorani (@sirajnoorani)

ఈ వాదులాటను ఆపడానికి మహిళా కానిస్టేబుల్ శారదా ఉగ్లె ప్రయత్నం చేశారు. కానీ, ఆమె ఆపలేకపోయారు. ఆమెనే గాయాల పాలయ్యారు. చివరకు ఓ హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందడానికి అడ్మిట్ అయ్యారు. సీటు కోసం జరిగిన వివాదంలో ఓ మహిళా స్టాఫ్ గాయపడ్డారని సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ వాషి రైల్వే స్టేషన్ ఎస్ కటారే తెలిపారు. 

click me!