వివాహేతర సంబంధం.. అనుమానించాడని భర్తమీద పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య...

By Bukka SumabalaFirst Published Aug 10, 2022, 9:31 AM IST
Highlights

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్తను అతి దారుణంగా హత్య చేసింది. తన సంబంధాన్ని అనుమానించాడని పెట్రోల్ పోసి, నిప్పంటించింది. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య.. భర్తమీద పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఆగ్రా డివిజన్‌లోని మధుర జిల్లాలో సోమవారం రాత్రి ఓ మహిళ తన భర్తకు పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. 80 శాతం కాలిన గాయాలతో ఆ వ్యక్తి మంగళవారం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స  తీసుకుంటూ మరణించాడు. ఈ సంఘటన కోసికలన్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం, రేఖ అనే మహిళకు వివాహం అయ్యింది. అయితే, వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం మీద ఆమె భర్త చమన్ ప్రకాష్ అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని భార్యను అడగడంతో సోమవారం భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. 

ఆ తరువాత రాత్రి చమన్ ప్రకాష్ గాఢనిద్రలో ఉన్న సమయంలో రేఖ అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ మృతి చెందారు. "కోసి కలాన్‌లోని మీనా నగర్ కాలనీకి చెందిన మృతుడు చమన్ ప్రకాష్ కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేఖపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయబడింది" అని స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనుజ్ కుమార్ అన్నారు.

పెళ్లైన ఇద్దరి మధ్య ప్రేమ.. వివాహేతర సంబంధంగా మారి.. పెళ్లికి ఒప్పుకోరని ఆత్మహత్య..

ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్ లో ఓ సూట్ కేసు కలకలం సృష్టించింది.  ఓ మహిళ  తీసుకు వెళుతున్న ట్రాలీ సూట్ కేసు మీద అనుమానంతో పోలీసులు చెక్ చేయగా.. వారి మైండ్ బ్లాంక్ అయ్యే విషయం బయటపడింది. ఆ సూట్కేసులో ఓ వ్యక్తి మృతదేహాన్ని ప్యాక్ చేసి తీసుకు వెళుతుంది ఆ మహిళ.  దీంతో ఆరా తీస్తే..  పోలీసులకే  దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సదరు మహిళ పేరు ప్రీతి శర్మ. పెళ్లయింది. కానీ..  వివాహేతర సంబంధం మోజులో పడి భర్తను వదిలేసింది. ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలం వీరిద్దరు బాగానే ఉన్నా.. తనను పెళ్లి చేసుకోమని ప్రీతి శర్మ అడగడంతో రచ్చ మొదలైంది. ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి అతను ఇష్టపడలేదు. ప్రియురాలికి కోపం నషాళానికి అంటింది. అంతే ప్రియుడిని గొంతు కోసి చంపేసింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  ఉత్తర ప్రదేశ్ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తమదైన శైలిలో ఎంక్వైరీ మొదలుపెట్టారు.  చనిపోయి, సూట్ కేసులో విగతజీవిగా ఉన్న వ్యక్తిని సంబల్ ఏరియాకు చెందిన ఫిరోజ్ గా ఐడెంటిఫై చేశారు. ఆ మహిళ ప్రీతి శర్మ అని,  భర్తను వదిలేసి ఫిరోజ్ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ లో ఉంటుందని తెలిసింది, ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని ఫిరోజ్ ను అడిగింది. కానీ ససేమిరా అన్నాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. అంతే సరైన సమయం చూసి రేజర్ తో అతని గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత డెడ్బాడీని పడేసేందుకు ఢిల్లీలోని సీలంపూర్ ఏరియాలో ఓ పెద్ద సూట్ కేస్ కొన్నది.  ఆ ట్రాలీ సూట్ కేసు లో మృతదేహాన్నిపెట్టి తీసుకు వెళుతుండగా  పోలీసులు గమనించారు. అనుమానం వచ్చి  ఫాలో అయ్యారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

click me!