నా భార్య, సొంత కొడుకునే పెళ్లాడింది... డబ్బులతో పరారయ్యింది.. పోలీసులకు భర్త ఫిర్యాదు..

By SumaBala BukkaFirst Published May 19, 2022, 8:27 AM IST
Highlights

ఉత్తరాఖండ్ లో ఊహించడానికి కూడా ఇష్టపడని ఘటన జరిగింది. ఓ కన్నతల్లి.. స్వయంగా జన్మనిచ్చిన కొడుకునే పెళ్లాడింది. ఈ విషయాన్ని భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఉత్తరాఖండ్ : సమాజం తలదించుకునే సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచి అక్రమసంబంధాలు, వివాహాలు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే వీటిలో కొన్ని నిజాలు కాగా, మరికొన్ని అవాస్తవాలుగా.. అనుమానాలుగా మిగిలిపోతున్నాయి. అలాంటి ఓ సంఘటన మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. సాక్షాత్తూ కన్నతల్లే.. కొడుకును పెళ్లి చేసుకుందని.. ఓ భర్తే స్వయంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తున్నారు.

తన భార్య కుమారుడినే వివాహం చేసుకుందని సాక్షాత్తు భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఉత్తరాఖండ్లోని ఉద్దంసింగ్ నగర్ లోని బాజపూర్ ప్రాంతానికి చెందిన తన భార్య బాబ్లి కుమారుడిని పెళ్లాడింది భర్త ఇంద్రారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య బాబ్లీ కి 11 ఏళ్ల వయసులోనే వివాహం కావడంతో ఆమెకు మొదటి భర్త నుంచి ఇద్దరు కుమారులు ఉన్నారు అని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తనను రెండో వివాహం చేసుకుందని ఇంద్రారామ్ చెప్పాడు. బాబ్లీ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  

ఇటీవలి కాలంలో మొదటి వివాహం వల్ల పుట్టిన ఆమె కుమారుల్లో ఒకరు ఇంటికి వెళ్లడం ప్రారంభించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె, ఆమె కుమారుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని భర్త ఆరోపించాడు. తన ఇంట్లో నుంచి రూ. 20 వేలు తీసుకుని వెళ్ళిపోయిందని ఆరోపించాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. 

ఇలాది ఉండగా, ఇలాంటి ఘటనే గతంలో కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. ఆ కారణంగా ఓ ప్రాణం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కన్న కొడుకుతో ఓ మహిళ కామవాంఛ తీర్చుకోవడానికి సిద్ధపడింది. తండ్రి చనిపోయిన తరువాత కుమారుడు తల్లితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, ఆ మహిళ కొడుకుతోనే కాకుండా మరికొంతమందితో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకుంది. చివరకు తన కొడుకు చేతిలోనే దారుణ హత్యకు గురయ్యింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. 

కర్ణాటకలోని హవేరీ జిల్లాలో గల వనహల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల శివప్ప తండ్రి ఏడాది క్రితం మరణించాడు. అప్పటి నుంచి కన్నతల్లితో అతను అక్రమసంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఆమె కూడా కుమారుడి కోరికను తీర్చడానికి సిద్ధపడింది. అయితే, శివప్పతోనే కాకుండా మరికొంత మందితో కూడా ఆమె తన కోరికను తీర్చుకుంటూ వచ్చింది. ఈ విషయం శివప్పకు తెలిసింది. అది శివప్ప సహించలేకపోయాడు. తనను తప్ప ఎవ్వరినీ కలవడానికి వీలులేదని, తనతో మాత్రమే ఉండిపోవాలని తల్లిని హెచ్చరించాడు. అయితే, అతని మాటలు తల్లి వినలేదు. దాంతో శివప్ప కోపంతో తల్లిని హత్య చేశాడు. హత్య, అత్యాచారం కింద కేసులు నమోదు పోలీసులు శివప్పను అరెస్టు చేశారు. నిందితుడు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 

click me!