కొన్ని గంటల్లో పెళ్లికి సిద్దమౌతున్న ఓ వధువును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఆ యువతిని నిందితులు బస్టాండ్ ప్రాంతంలో వదిలివెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చండీఘడ్: కొన్ని గంటల్లో పెళ్లికి సిద్దమౌతున్న ఓ వధువును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఆ యువతిని నిందితులు బస్టాండ్ ప్రాంతంలో వదిలివెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పంజాబ్ రాష్ట్రంలోని ముక్తాసర్లో నివాసం ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ఆ యువతికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఆ యువతి బ్యూటీ పార్లర్కు వచ్చింది. అయితే బ్యూటీ పార్లర్కు వచ్చిన ఆ యువతిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
బ్యూటీ పార్లర్ వద్ద ఉన్న సీసీటీవీల్లో ఆ యువతిని దుండగులు కిడ్నాప్ చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. దుండగుల నుండి తప్పించుకొనేందుకు ఆ యువతి ప్రయత్నించింది.
దుండగులు ఆ యువతిని ఫిరోజ్పూర్లోని బస్టాండ్ వద్ద వదిలివెళ్లారు. ప్రస్తుతం యువతి ముక్తాసర్ పోలీసుల రక్షణలో ఉంది. యువతిని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.