భర్తను వదిలేసి.. 8మందిని పెళ్లిచేసుకుని మోసం.. తొమ్మిదో పెళ్లి సిద్ధం.. ఎయిడ్స్ సోకడంతో ట్విస్ట్...

Published : Sep 02, 2021, 03:51 PM IST
భర్తను వదిలేసి.. 8మందిని పెళ్లిచేసుకుని మోసం.. తొమ్మిదో పెళ్లి సిద్ధం.. ఎయిడ్స్ సోకడంతో ట్విస్ట్...

సారాంశం

ఇలా ఏకంగా ఎనిమిది మందిని  పెళ్లి చేసుకుని  మోసం చేసింది.  ఇది ఇలా ఉండగా ఆ ఎనిమిది మంది భర్తలకు మరో టెన్షన్ వచ్చి పడింది. ఆ మహిళకు  ఎయిడ్స్ సోకింది.  దీంతో తమకు కూడా సోకిందేమో అనే ఆందోళనలో ఆ భర్తలు ఉన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానా : పెళ్లి కావాల్సిన యువకులు... విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నవారిని ఏరికోరి పట్టుకుంటుంది. వారిని పెళ్లి చేసుకుంటుంది. పట్టుమని పది రోజులు కూడా కాపురం  చేయదు.  ఏదో ఒక కారణంతో విడాకులు తీసుకుంటుంది.  ఆ విడాకులకు భారీ ఎత్తున భరణం చెల్లించుకుని ఉడాయిస్తున్న ఓ ఘరానా మహిళ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఆమె ఇలా ఏకంగా ఎనిమిది మందిని  పెళ్లి చేసుకుని  మోసం చేసింది.  ఇది ఇలా ఉండగా ఆ ఎనిమిది మంది భర్తలకు మరో టెన్షన్ వచ్చి పడింది. ఆ మహిళకు  ఎయిడ్స్ సోకింది.  దీంతో తమకు కూడా సోకిందేమో అనే ఆందోళనలో ఆ భర్తలు ఉన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానా రాష్ట్రం కైతల్ జిల్లాకు చెందిన మహిళా 2010లో ఓ వ్యక్తిని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఏమైందో ఏమో కానీ ఆమె భర్త అదృశ్యమయ్యాడు. భర్త వదిలేయడంతో ఇక ఏ దిక్కు లేక బతకడం కష్టంగా మారింది. బతుకుతెరువు కోసం  మోసాలకు పాల్పడడం  ప్రారంభించింది.

హరియానా తో పాటు పక్కనే ఉన్న పంజాబ్లోనూ మోసాలు చేయడం మొదలుపెట్టింది.  ఆమె లక్ష్యం భార్యలను  కోల్పోయిన వారు, బ్రహ్మచారులే. తన తల్లితో కలిసి పక్కాగా ప్లాన్ చేస్తుంది. తరువాత తల్లితో కలిసి మాటల్లో దింపి అవివాహితులను,  భార్యలను వదిలేసిన వారిని పెళ్లి చేసుకోవడం అలవాటుగా మార్చుకుంది.  ఏ గుడిలోనో లేదా మరోచోట నిరాడంబరంగా పెళ్లి చేసుకుని వారితో కాపురం  మొదలుపెడుతుంది. 

ఆ తరువాత ఏదో ఒక వంకతో భర్తతో గొడవ పెట్టుకుని ఆ తర్వాత విడాకులు కోరుతుంది.  కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తుంది. ఈ భయంతో ఆమెను చేసుకున్న వారు ఎంతో కొంత భరణంగా ముట్టజెప్పి వదిలించుకుంటారు. ఇలా లక్షల్లో దండుకుని ఆమె మకాం మారుస్తుంది. ఇలా ఏకంగా ఎనిమిది మందిని ఆమె వివాహం చేసుకుంది.  ఈమె పై గతంలో కొందరు ఫిర్యాదు చేశారు.

తాజాగా 9వ పెళ్లి చేసుకోబోతున్న పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఆ పెళ్లి ఆపేసి స్టేషన్కు తరలించారు.  ఈ సమయంలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా  హెచ్ఐవి ఎయిడ్స్  సోకిందని నిర్థారణ అయింది. ఆమె ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది భర్తలు ఈ విషయం తెలుసుకొని షాక్కు గురయ్యారు. తమకు ఎక్కడ సోకిందేమోనని అని ఆమె భర్త లు ఆందోళన చెందుతున్నారు. వారికి కూడా పోలీసులు పరీక్షలు  చేయించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?