మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ.. వీడియో వైర‌ల్

By Rajesh KarampooriFirst Published Sep 24, 2022, 1:10 AM IST
Highlights

రేవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మ‌రో సారి వార్త‌ల్లో నిలిచారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న ‘సేవా పఖ్‌వాడ’ కార్యక్రమంలో  పాల్గొన్న ఆయ‌న  ఖత్‌ఖారీలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడ  పరిశుభ్రంగా ఉన్న స్కూల్‌ మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో శుభ్రం చేశారు. 

ఎప్పుడూ ఎదో ప‌నిచేస్తూ వార్త‌ల్లో నిలిచే.. బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా (బీజేపీ ఎంపీ టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్నారు) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేవా ఎంపీ గురువారం టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ కనిపించారు.  ఎలాంటి బ్రాష్, గ్లౌజులు లేకుండా చేతులతోనే స్వ‌యంగా టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్నాడు. గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను 5-6 తరగతులు చదువుతున్న బాలికలతో గత మంగళవారం శుభ్రం చేయించారు.  ఈ వీడియోను స్వయంగా ట్వీట్ చేసి, ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు.


గురువారం ఉదయం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరయ్యేందుకు ఎంపీ మౌగంజ్‌లోని ఖత్వారీ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రభుత్వ బాలికల పాఠశాలకు చేరుకున్నారు. పాఠ‌శాల‌ను తనిఖీ చేసిన ఆయ‌న మరుగుదొడ్డి అపరిశుభ్రంగా కనిపించడంతో సిబ్బందిపై సీరియ‌స్ అయ్యారు. అనంతరం ఎంపీ స్వయంగా తన చేతులతో శుభ్రం చేయడం ప్రారంభించారు. టాయిలెట్‌లో శుభ్రం చేసేటప్పుడు క‌నీసం బ్రష్‌లు, గ్లౌజులు కూడా వేసుకోలేదు.

అనంత‌రం ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ప్ర‌ధాని మోడీతో  స‌హా ప‌లువురు నేత‌ల‌కు ట్యాగ్ చేశారు.ఈ  వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వాస్తవానికి, బిజెపి ఎంపి జనార్దన్ మిశ్రా తన వాక్చాతుర్యం, వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో తరచుగా వార్త‌ల్లో నిలుస్తారు. ఇప్పుడు టాయిలెట్ శుభ్రం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంతకు ముందు కూడా అతను చాలాసార్లు టాయిలెట్‌ని శుభ్రం చేశాడు.

అంతకుముందు, అతను రేవాలోని బన్సల్ బస్తీ కాలనీలో మురికిని శుభ్రం చేస్తూ కనిపించాడు. అదే సమయంలో 2014 సంవత్సరంలో, బిజెపి ఎంపి జనార్దన్ మిశ్రాను కూడా క్లీనెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద, బీజేపీ ఎంపీలు తరచూ పరిసరాల పరిశుభ్రత కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కరోనా సమయంలో అతను స్వయంగా  మాస్క్‌లను కుట్టి పంపిణీ చేస్తున్నాడు.

पार्टी द्वारा चलाये जा रहे सेवा पखवाड़ा के तहत युवा मोर्चा के द्वारा बालिका विद्यालय खटखरी में वृक्षारोपण कार्यक्रम के उपरांत विद्यालय के शौचालय की सफाई की। pic.twitter.com/138VDOT0n0

— Janardan Mishra (@Janardan_BJP)
click me!