పశ్చిమ బెంగాల్ లో హింస.. పంచాయతీ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత

Published : Jul 08, 2023, 01:58 PM IST
పశ్చిమ బెంగాల్ లో హింస..  పంచాయతీ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన  కాంగ్రెస్ నేత

సారాంశం

పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనల్లో 9 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన హింస, హత్యల కారణంగా పశ్చిమ బెంగాల్ లో శనివారం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు కౌస్తవ్ బాగ్చీ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందించారు.

హింసాత్మకంగా మారిన బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. ఘర్షణల్లో 9 మంది మృతి, బ్యాలెట్ బాక్సులు దగ్ధం

ఉదయం 7 గంటలకు పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకు ఆరుగురు మృతి చెందారు. అయితే అర్ధరాత్రి నుంచి జరిగిన హింసాకాండలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం అత్యవసర విచారణ కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందించినట్టు బాగ్చీ మీడియాతో తెలిపారు. 

రాష్ట్రంలో గ్రామీణ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని ఆయన అందులో హైకోర్టుకు విజ్ఞప్తి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడం, హింస, హత్యలను కోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇరాన్ పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులు.. ఇండియాలో హైఅలర్ట్
Ayatollah Ali Khamenei: ఖమేనీ ఖతంకన్నీళ్లు పెట్టుకున్న ముస్లిం మహిళలు| Asianet News Telugu