ఒడిశాలోని థియేటర్లకు పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా దెబ్బ

Published : Apr 12, 2021, 10:26 AM IST
ఒడిశాలోని థియేటర్లకు పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా దెబ్బ

సారాంశం

ఒడిశాలోని రెండు థియేటర్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా దెబ్బ తగిలింది. కోవిడ్ నిబంధనలను పాటించలేదనే కారణంతో రెండు థియేటర్లను అధికారులు సీల్ చేశారు.

భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మానియా కొనసాగుతోంది. థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని రెండు థియేటర్లకు వకీల్ సాబ్ దెబ్బ తగిలింది. 

ఒడిశాలో వకీల్ సాబ్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు పవన్ కల్యాణ్ అభిమానులు దండిగా వస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను పాటించని రెండు సినిమా థియేటర్లపై అధికారులు కొరడా ఝళిపించారు. గజపతి జిల్లా పర్లాఖేముండి పట్టణంలోని రెండు థియేటర్లలో వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. 

సినిమా చూసేందుకు ఆ రెండు థియేటర్లకు పెద్ద యెత్తున ప్రేక్షకులు వచ్చారు. పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద యెత్తున థియేటర్లకు చేరుకున్నారు. ఈ సందర్భంలో థియేటర్ల యాజమాన్యాలు కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ రెండు సినిమా థియేటర్లను అధికారులు తాత్కాలికంగా సీల్ చేశారు. 

కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని అధికారులు సూచించారు. పింక్ హిందీ సినిమా ఆధారంగా వకీల్ సాబ్ సినిమా నిర్మితమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వకీల్ గా నటించాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్ పోషించారు.

PREV
click me!

Recommended Stories

ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
Indian Army : సైన్యం కోసం ఇండియా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?