వ్యాక్సిన్ వృథా కాకూడదు.. ప్రధాని మోదీ అల్టిమేటం..!

Published : Jun 05, 2021, 09:56 AM IST
వ్యాక్సిన్ వృథా కాకూడదు.. ప్రధాని మోదీ అల్టిమేటం..!

సారాంశం

దేశంలో వ్యాక్సిన్ ఎక్కువగా వృథా అవుతోందని.. దానిని తగ్గించాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు.

కాగా..  తాజాగా.. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ హై లెవల్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.  ఈ రివ్యూ మీటింగ్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ...  దేశంలో వ్యాక్సిన్ ఎక్కువగా వృథా అవుతోందని.. దానిని తగ్గించాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం నాటికి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం.. 22.75కోట్ల వ్యాక్సిన్లను అందజేసింది. దానిలో వృథా అయినవి కూడా ఉండటం గమనార్హం.

రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో, ప్రస్తుత టీకాల లభ్యత  దానిని పెంచడానికి, రోడ్‌మ్యాప్ గురించి అధికారులు  ప్రధాని మోదీకి వివరించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి, వివిధ వ్యాక్సిన్ తయారీదారులకు సహాయపడటానికి చేపట్టిన ప్రయత్నాల గురించి కూడా ప్రధానికి వివరించారు.

టీకా ప్రక్రియను మరింత ప్రజలకు అనుకూలంగా మార్చడానికి టెక్ ఫ్రంట్‌లో వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు వారు ప్రధానికి చెప్పారు.

వ్యాక్సిన్ లభ్యతపై రాష్ట్రాలకు ముందస్తు విజిబిలిటీ కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ సమాచారాన్ని జిల్లా స్థాయికి పంపించాలని రాష్ట్రాలను కోరినట్లు చెప్పారు.

ఇదిలావుండగా, భారతదేశం యొక్క క్రియాశీల కరోనావైరస్ కేసులు శుక్రవారం 16,35,993 కు తగ్గింది. శుక్రవారం కొత్తగా  1.32 లక్షల మందికి పాజిటివ్ గా తేలింది. 

భారతదేశం లో కరోనా సోకిన వారి సంఖ్య  2,85,74,350 కి చేరింది. మరోవైపు, భారత్ కరోనా జాతీయ రికవరీ రేటు ఇప్పుడు 93.08% కి పెరిగింది.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu