పొరుగింటి యువకుడిని మధ్యాహ్నం పూట ఇంటిలోకి పిలిచింది.. అతడి జననాంగాలను కట్ చేసిన వివాహిత

Published : Nov 18, 2023, 07:58 PM IST
పొరుగింటి యువకుడిని మధ్యాహ్నం పూట ఇంటిలోకి పిలిచింది.. అతడి జననాంగాలను కట్ చేసిన వివాహిత

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ పొరుగింటిలో ఉండే యువకుడిని కొంచెం పని ఉన్నదని ఇంటిలోకి పిలిచింది. వారికి గొడవ జరిగింది. అనంతరం, ఆ యువకుడి జననాంగాలను కట్ చేసింది. ఆమె భర్త యూఏఈలో ఉంటున్నాడు.  

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో విస్మయకర ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత పొరిగింటిలోనే ఉండే యువకుడిని ఇంటిలోకి పిలిచింది. ఆ తర్వాత అతడి జననాంగాలను కోసేసింది. అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న ఆ యువకుడిని అతడి తండ్రి చూసి వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు. ఈ ఘటన లక్నోలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ఇంటిలో కొంచెం పని ఉన్నదని పొరుగింటి యువకుడిని ఆ వివాహిత రమ్మని పిలిచింది. ఆ యువకుడు వెళ్లాడు. ఆ తర్వాత కొంతసేపటికి వారిద్దరికి గొడవ జరిగింది. అనంతరం, అతడి జననాంగాలను ఆమె కట్ చేసింది. 

కొడుకు అపస్మారక స్థితిలో పొరుగింటిలో పడి ఉండటాన్ని తండ్రి చూశాడు. వెంటనే కౌశంబి జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించాడు. ఆ యువకుడు ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. అనంతరం, ట్రీట్‌మెంట్ కోసం అతడిని ప్రయాగ్ రాజ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. 

Also Read: Israel War: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కాల్చి పారేయాలి: కాంగ్రెస్ ఎంపీ షాకింగ్ కామెంట్లు

పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త యూఏఈలో ఉంటున్నాడు. ఆ యువకుడి పై దాడి చేయడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాంఝాపూర్ పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద ఆమె పై కేసు నమోదైంది.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు