2 నెలల్లో న్యాయం... నాలుగేండ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష

Published : Feb 05, 2023, 05:26 AM IST
2 నెలల్లో న్యాయం... నాలుగేండ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష

సారాంశం

 గతేడాది నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఘజియాబాద్‌లోని ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది.దోషి సోనూ గుప్తా గతేడాది డిసెంబర్ 1న మైనర్‌ను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశాడు. మరుసటి రోజు సాహిబాబాద్‌లోని నగర అటవీ ప్రాంతానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది.

గత రెండు నెలల క్రితం  నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడికి యూపీలోని ఘజియాబాద్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ 1న నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సోనూ గుప్తాకు పోక్సో కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి శనివారం మరణశిక్ష విధించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ట్రాన్స్ హిండన్ దీక్షా శర్మ తెలిపారు. కేసు వివరాలను తెలియజేస్తూ.. సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ ఫారెస్ట్‌లో ఘటన జరిగిన మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

ఘటనను ఛేదించేందుకు పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారని, నేరం జరిగిన ఆరు రోజుల తర్వాత, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా, నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లోని దీనదయాళ్ పురి ఏరియాలోని 40 ఫుట్ రోడ్‌లో నిందితుడు సోను గుప్తా (20)ని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అతన్ని జైలుకు పంపారు.
 
ఘటన జరిగిన 15 రోజుల్లోనే పోలీసులు కిడ్నాప్, అత్యాచారం, హత్య సెక్షన్లలో చార్జ్ షీట్ దాఖలు చేశారని దీక్షా శర్మ తెలిపారు. రెండు నెలల నాలుగు రోజుల్లోనే కోర్టు తీర్పు వెలువరించిందన్నారు. 16 మంది సాక్షులను విచారించిన అనంతరం నిందితుడిని శుక్రవారం కోర్టు దోషిగా నిర్ధారించిందని తెలిపారు. అత్యాచారం చేయాలనే ఉద్దేశంతోనే బాలికను అపహరించినట్లు సోనూ గుప్తా అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

బాలిక కేకలు వేయడంతో ఆమె నోటిలో మురికి గుడ్డను బిగించి గొంతుకోసి హత్య చేశాడు. సోనూ, బాధితురాలి రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు డీఎన్‌ఏ పరీక్షకు పంపారని, దీంతో రక్తపు మరకల సారూప్యతను నిర్ధారించామని డీసీపీ తెలిపారు. అత్యాచార నిందితుడి నుండి సిటీ ఫారెస్ట్ పార్క్‌కి ప్రవేశ టికెట్ కూడా స్వాధీనం చేసుకుంది, ఇది అతను ఆ ప్రాంతంలో ఉన్నట్లు నిర్ధారించింది.

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!