చదువే కాదు అవీ ముఖ్యమే...: యువత భవిష్యత్తు కోసం యోగి సర్కార్ సరికొత్త చర్యలు

By Arun Kumar PFirst Published Oct 22, 2024, 12:24 PM IST
Highlights

యువత సర్వతోముఖాభివృద్ధి కోసం యోగి సర్కార్ కొత్త ప్రయత్నం చేపట్టింది. విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం లాంటి అంశాలపై దేశవ్యాప్త నిపుణులతో చర్చలు జరుపుతోంది.

లక్నో : యువత చదువులో రాణించడమే కాదు శారీరక-మానసిక ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి సమాజానికి, దేశా భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ చాలా కార్యక్రమాలను చేపడుతోంది... వీటిని యోగి సర్కార్ ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తోంది. ఇలా యూపీ ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ, జాతీయ జనాభా విద్యా ప్రాజెక్ట్ (ఎన్‌పిఇపి) ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఎన్‌సిఇఆర్‌టి నిర్వహణలో చర్చా కార్యక్రమం నిర్వహించారు.ఇందులో యూపీతో పాటు 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 70 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.

యువత సర్వతోముఖాభివృద్ధికి విధివిధానాలు రూపొందించడం, వారి విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం గురించి చర్చించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. సామాజిక శాస్త్ర విద్య విభాగం, ఎన్‌సిఇఆర్‌టి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఎస్‌సిఇఆర్‌టి సహకారంతో యువతకు ఆరోగ్యకరమైన జీవనశైలి, మానసిక ఆరోగ్యం, సమాజంలో సానుకూల పాత్ర పోషించడం గురించి అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Latest Videos

యువత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

యువత శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, సామాజిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని యువతలో ఆరోగ్య అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సకలని ఫోన్ ద్వారా మాట్లాడుతూ... అక్టోబర్ 19 నుంచి 21 వరకు జాతీయ జనాభా విద్యా ప్రాజెక్ట్ (ఎన్‌పిఇపి) మధ్యంతర సమీక్ష జరింగిందని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ఎస్‌సిఇఆర్‌టి, ప్రాంతీయ విద్యా సంస్థలు చేపట్టిన జనాభా విద్య కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు.

జాతీయ విద్యా విధానం 2020 నిబంధనల ప్రకారం ప్రయత్నం

ఎన్‌సిఇఆర్‌టి ప్రొఫెసర్ గౌరీ శ్రీవాస్తవ మాట్లాడుతూ... జాతీయ విద్యా విధానం 2020, ఎన్‌సిఎఫ్ 2023 మార్గదర్శకాల ప్రకారం యువత విద్య, సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా యువత అభివృద్ధికి విధివిధానాలు రూపొందిస్తున్నారు.

 ఎస్‌సిఇఆర్‌టి లక్నో డైరెక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం (2020) ప్రకారం టీమ్‌వర్క్, నైతిక విలువలు, భారతీయ జ్ఞాన సంప్రదాయం ప్రాముఖ్యతను నొక్కిచెబుతున్నామని అన్నారు. ఇది ప్రణాళిక మధ్యంతర సమీక్ష.

యువత భవిష్యత్తుపై చర్చ

ఎస్‌సిఇఆర్‌టి ఉత్తరప్రదేశ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పవన్ సచాన్ మాట్లాడుతూ... ఈ మూడు రోజుల చర్చా కార్యక్రమంలో నిపుణులు, ప్రతినిధులు యువత భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చిస్తున్నారని చెప్పారు. దేశ యువతను సాధికారత, అవగాహన కలిగిన వారిగా తీర్చిదిద్దడమే లక్ష్యం.  యుక్తవయస్సులో వచ్చే శారీరక, మానసిక మార్పులను సానుకూల దృక్పథంతో చూడాలని, వ్యాయామం, ఆటస్థలాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పాలని, మాదకద్రవ్యాలు, ఇంటర్నెట్ వ్యసనం ప్రమాదాల గురించి చర్చిస్తున్నామని అన్నారు.

 ఐసిఎంఆర్ నివేదిక ప్రకారం, 1990 నుంచి 2016 మధ్య కాలంలో దేశంలో అంటువ్యాధుల కంటే ఇతర వ్యాధుల వల్ల ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని తేలింది.  దీన్ని దృష్టిలో ఉంచుకుని యోగి సర్కార్ యువతలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.

 ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సందీప్ సింగ్ మాట్లాడుతూ... యువతను సమాజంలో చురుకైన, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ చర్చల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల వాడకం, సామాజిక హింస వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడమే లక్ష్యం.

click me!